వైద్య విద్య సీట్ల మార్పిడి కేసులో కేంద్రం, రాష్ట్రానికి సుప్రీం నోటీసులు
ABN , First Publish Date - 2020-07-14T08:32:08+05:30 IST
వైద్య విద్య కోర్సుల్లో పీజీ డిప్లొమా సీట్లను సరెండర్ చేసి పీజీ డిగ్రీ సీట్లకు అర్హత పొందే అంశంపై గతంలో
న్యూఢిల్లీ, జూలై 13 (ఆంధ్రజ్యోతి): వైద్య విద్య కోర్సుల్లో పీజీ డిప్లొమా సీట్లను సరెండర్ చేసి పీజీ డిగ్రీ సీట్లకు అర్హత పొందే అంశంపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) దాఖలు చేసిన పిటిషన్లో కేంద్రం, తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్పై సోమవారం న్యాయమూర్తులు జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్, జస్టిస్ వినీత్ సరణ్తో కూడిన ద్విసభ్య ఽధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషన్లోని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టుకు వాయిదా వేసింది.