వానాకాలం పంట పెట్టుబడులకు రైతు బంధు అందాలి
ABN , First Publish Date - 2020-05-09T09:39:48+05:30 IST
ప్రభుత్వం అందించే రైతు బంధు నిధులు వానాకాలం పంటలకు పెట్టుబడిగా ఉపయోగపడాలని, ఈ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి టి. హరీశ్రావు సూచించారు. రైతు బంధు పథకం అమలుపై ఆరణ్యభవన్లో
హైదరాబాద్, మే 8 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అందించే రైతు బంధు నిధులు వానాకాలం పంటలకు పెట్టుబడిగా ఉపయోగపడాలని, ఈ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి టి. హరీశ్రావు సూచించారు. రైతు బంధు పథకం అమలుపై ఆరణ్యభవన్లో శుక్రవారం అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి జనార్దన్రెడ్డి పాల్గొన్నారు.