తిమ్మాపూర్లో దొంగతనాలు
ABN , First Publish Date - 2020-12-31T05:05:40+05:30 IST
తిమ్మాపూర్లో దొంగతనాలు
కొత్తూర్: కొత్తూర్ పోలీ్సస్టేషన్ పరిధిలోని స్టేషన్ తిమ్మాపూర్ రోడ్డులో మంగళవారం తెల్లవారుజామున రెండు వేర్వేరు దొంగతనాల్లో రూ.20 వేల విలువైన సిగరేట్లతో పాటు ఒక సెల్ఫోన్ను చోరీ జరిగిందని ఏఎ్సఐ అబ్దుల్లా తెలిపారు. రాజు కిరాణా దుకాణం వెనుక నుంచి దొంగలు చొరబడి సిగిరెట్ ప్యాకెట్లను ఎత్తుకెళ్లారని తెలిపారు. అలాగే కోస్గి జగన్ ఇంట్లోకి చొరబడి సెల్ఫోన్ను అపహరించుకుపోయారని తెలిపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఏఎ్సఐ తెలిపారు.