సింగూర్ ప్రాజెక్టుకు తగ్గిన వరద ఉధృతి
ABN , First Publish Date - 2020-09-21T13:40:31+05:30 IST
సింగూర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గింది. ప్రస్తుతం సింగూర్ నీటి మట్టం 17.643 టీఎంసీలకు చేరింది.
సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గింది. ప్రస్తుతం సింగూర్ నీటి మట్టం 17.643 టీఎంసీలకు చేరింది. ఇన్ ఫ్లో 10779 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 120 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటిమట్టం 17.643 టీఎంసీలు కాగా... పూర్తి స్థాయి నీటిమట్టం 29.917 టీఎంసీలుగా నమోదు అయ్యింది.