శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద
ABN , First Publish Date - 2020-08-18T15:08:25+05:30 IST
భారీ వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ఉధృతి కొనసాగుతోంది.
నిజామాబాద్: భారీ వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ఉధృతి కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 61,390 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 800 క్యూసెక్కులుగా ఉంది. అలాగే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు(90 టీఎంసీలు) కాగా... ప్రస్తుత నీటిమట్టం 1080.10 అడుగులకు(52టీఎంసీలు) చేరింది.