ఎమ్మెల్యే చెన్నమనేని కేసులో స్టే పొడిగింపు
ABN , First Publish Date - 2020-05-09T10:21:42+05:30 IST
ఎమ్మెల్యే చెన్నమనేని కేసులో స్టే పొడిగింపు
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వాన్ని కేంద్ర హోంశాఖ రద్దు చేయడంపై స్టే ఆదేశాలను హైకోర్టు మరోసారి పొడిగించింది. ఈ వ్యాజ్యంలో తుది విచారణ చేపడతామన్న హైకోర్టు విచారణను జూన్ 16కు వాయిదా వేసింది. ఈమేరకు జస్టిస్ ఏ.అభిషేక్రెడ్డి శుక్రవారం ఆదేశాలిచ్చారు.