మూల్యాంకనానికి సహకరించండి
ABN , First Publish Date - 2020-05-09T09:58:31+05:30 IST
మూల్యాంకనానికి సహకరించండి
హైదరాబాద్, మే 8 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ఇంటర్ మూల్యాంకనానికి సహకరించాలని అధ్యాపక సంఘాలను, ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలను ఇంటర్బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ కోరారు. ఈ మేరకు వారితో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీలైనంత ఎక్కువ మంది లెక్చరర్లను మూల్యాంకనాన హాజరయ్యేలా చూడాలని కోరారు. హాస్టల్ ఉన్న కాలేజీలు లెక్చరర్లకు భోజనం సౌకర్యం కల్పించాలని సూచించారు.