దళితుడికి పూజలు చేయనని వెనక్కి పంపిన పూజారి

ABN , First Publish Date - 2020-11-13T17:52:07+05:30 IST

అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది.

దళితుడికి పూజలు చేయనని వెనక్కి పంపిన పూజారి

జనగామ: అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. దళితుడికి పూజలు చేయనని ఆలయ పూజారి వెనక్కి పంపించాడు. దీంతో గుడి వద్ద దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. పోలీసులు పూజారి అభయాంజనేయ శర్మను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


దళిత వర్గానికి చెందిన భాస్కర్, సంధ్య దంపతులు తమ కుమారుడికి శాంతి పూజ చేయించేందుకు శుక్రవారం ఆలయానికి వచ్చారు. పూజ చేయాలని పూజారిని కోరగా.. దళిత వర్గానికి చెందినవారని తెలుసుకుని.. దళితులకు ఆలయంలో ప్రవేశం లేదని, పూజలు చేయమని పూజారి చెప్పడంతో ఆ దంపతులు వెనక్కి వచ్చారు. విషయం తెలుసుకున్న దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగాయి. దళితులపై వివక్ష ఎందుకుని దళితులు ప్రశ్నించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పూజారిని అరెస్టు చేశారు.

Updated Date - 2020-11-13T17:52:07+05:30 IST