గవర్నర్తో ఎస్ఈసీ నిమ్మగడ్డ భేటీ
ABN , First Publish Date - 2021-02-08T23:35:06+05:30 IST
గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్తో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ భేటీ అయ్యారు. తొలిదశ పంచాయతీ ఎన్నికలకు..
విజయవాడ: గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్తో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ భేటీ అయ్యారు. తొలిదశ పంచాయతీ ఎన్నికలకు 12 జిల్లాల్లో చేసిన ఏర్పాట్లపై ఎస్ఈసీ వివరించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలపై తీసుకున్న చర్యలు, హైకోర్టు తీర్పుపై వివరించారు. పెద్దిరెడ్డి ఎన్నికల ప్రక్రియ, మీడియాకు ఈ నెల 21 వరకు దూరంగా ఉండాలని హైకోర్టు ఆదేశాలపై కూడా గవర్నర్కు ఎస్ఈసీ తెలిపారు.