తప్పులను సరిచేయండి!
ABN , First Publish Date - 2021-10-31T08:38:13+05:30 IST
తప్పులను సరిచేయండి!
వివేకా కేసు చార్జిషీటు వెనక్కి పంపిన కోర్టు
సరిచేసి సమర్పించిన సీబీఐ
పులివెందుల, అక్టోబరు 30: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ సమర్పించిన చార్జిషీటును కడప జిల్లా పులివెందుల కోర్టు వెనక్కి ఇచ్చినట్లు తెలిసింది. చార్జిషీటును పరిశీలించే క్రమంలో, అందులో కొన్ని తప్పులు ఉన్నట్లు న్యాయస్థానం గుర్తించింది. సరిచేసి ఇవ్వాలని ఆదేశించడంతో చార్జిషీటును సరిచేసి మళ్లీ కోర్టుకు సీబీఐ సమర్పించినట్లు సమాచారం.