వివేకా మాజీ డ్రైవర్ను విచారించిన సీబీఐ
ABN , First Publish Date - 2021-08-21T09:24:26+05:30 IST
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి సీబీఐ అధికారులు శుక్రవారం ఒకరిని విచారించారు.
కడప క్రైం, ఆగస్టు 20: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి సీబీఐ అధికారులు శుక్రవారం ఒకరిని విచారించారు. కడప కేంద్ర కారాగారంలోని అతిఽథి గృహంలో వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరిని సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఇప్పటికే ఇతడిని పలుమార్లు విచారించారు. నేడు మరికొందరిని విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.