ఎమ్మెల్సీ కరీమున్నీసా మృతికి మండలి సంతాపం
ABN , First Publish Date - 2021-11-23T09:48:40+05:30 IST
ఎమ్మెల్సీ కరీమున్నీసా మృతికి మండలి సంతాపం
అమరావతి, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎమ్మెల్సీ మహమ్మద్ కరీమున్నీసా ఆకస్మిక మరణం పట్ల సోమవారం రాష్ట్ర శాసనమండలి తీవ్ర సంతాపం తెలిపింది. ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. చైర్మన్ కొయ్యే మోషేన్రాజు మాట్లాడుతూ సభలో సభ్యురాలి అని కాకుండా తాను సొంత తల్లిని కోల్పోయినట్లుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.