విశాఖ అభివృద్ధికి కృషి చేస్తా: మేయర్ హరివెంకటకుమారి
ABN , First Publish Date - 2021-03-18T18:05:10+05:30 IST
ఏపీలో ప్రమాణ స్వీకారాల సందడి కొనసాగుతోంది. విశాఖ మేయర్గా హరివెంకట కుమారి ప్రమాణం చేశారు.
విశాఖ: ఏపీలో ప్రమాణ స్వీకారాల సందడి కొనసాగుతోంది. విశాఖ మేయర్గా హరివెంకట కుమారి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆమె ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ పార్టీ, ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, విశాఖ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. విశాఖను ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్ చేసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. విశాఖలో నీటి సమస్య లేకుండా చూస్తామన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఒక బీసీ మహిళగా తనకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయికి హరివెంకట కుమారి కృతజ్ఞతలు తెలిపారు.