కరోనా బాధిత పిల్లలకు డిపాజిట్ను 25 లక్షలకు పెంచాలి
ABN , First Publish Date - 2021-05-30T09:19:05+05:30 IST
కరోనా మహమ్మారి వల్ల తల్లిదండ్రులను కోల్పోయి, అనాథలుగా మారిన పిల్లలను ఆదుకోవటానికి ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో ప్రభుత్వం ఇస్తానన్న రూ.10 లక్షలను రూ.25 లక్షలకు పెంచాలని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్నాయుడు
అమరావతి, మే 29(ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి వల్ల తల్లిదండ్రులను కోల్పోయి, అనాథలుగా మారిన పిల్లలను ఆదుకోవటానికి ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో ప్రభుత్వం ఇస్తానన్న రూ.10 లక్షలను రూ.25 లక్షలకు పెంచాలని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్నాయుడు డిమాండ్ చేశారు. అనాథలైన ఆ పిల్లలకు తక్షణం రూ.3 లక్షలు అందజేయాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికు శనివారం ఆయన ఓ లేఖ రాశారు.