కడప జిల్లాలో విషాదం
ABN , First Publish Date - 2021-08-10T17:24:51+05:30 IST
కడప జిల్లాలో విషాదం నెలకొంది. రాజుపాలెం మండలం పరిధిలోని వెంగలాయపల్లెలో అదృశ్యమైన...
కడప జిల్లాలో విషాదం నెలకొంది. రాజుపాలెం మండలం పరిధిలోని వెంగలాయపల్లెలో అదృశ్యమైన బాలుడు మృతి చెందాడు. ఈ నెల 7న తనూష్రెడ్డి (9) అదృశ్యమయ్యాడు. వెంగలాయపల్లెలో కంపచెట్లలో బాలుని మృతదేహం లభ్యమైంది. బాలుడిని హత్య చేసిన దుండగులు కంపచెట్లలో పడేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే బాలుడి మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.