కేంద్ర మంత్రులను కలిసిన బుగ్గన రాజేంద్రనాథ్
ABN , First Publish Date - 2021-01-14T00:30:59+05:30 IST
పలువురు కేంద్ర మంత్రులను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ
ఢిల్లీ: పలువురు కేంద్ర మంత్రులను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో నేషనల్ లా వర్సిటీ తరహా వర్సిటీ ఏర్పాటు చేయాలని కోరామని తెలిపారు. ధాన్యం సేకరణకు పెండింగ్ బకాయిలు ఇవ్వాలని, నివార్ తుపాను ధాన్యం కొనుగోలు మినహాయింపులు ఇవ్వాలని కోరామని ఆయన పేర్కొన్నారు. కొత్త ఇండస్ట్రియల్ పార్క్లు డెవలప్మెంట్ అవకాశాలు ఇవ్వాలని కోరామని బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు.