‘అమరరాజా’కు భారీ షాక్‌!

ABN , First Publish Date - 2021-05-01T17:37:34+05:30 IST

తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్‌ కుటుంబ యాజమాన్యంలోని

‘అమరరాజా’కు భారీ షాక్‌!

  • చిత్తూరులోని ప్లాంట్లు మూసివేయండి
  • ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఆదేశం
  • నిబంధనలు ఉల్లంఘించలేదు: అమరరాజా

న్యూఢిల్లీ : తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్‌ కుటుంబ యాజమాన్యంలోని అమరరాజా బ్యాటరీస్‌ కంపెనీకి రాష్ట్రప్రభుత్వం పెద్ద షాకిచ్చింది. కాలుష్య నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించిందనేపేరుతో చిత్తూరు జిల్లాలోని ఆ కంపెనీకి చెందిన ప్లాంట్లను మూసివేయాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ బోర్డు (ఏపీపీసీబీ) శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఈ ఆదేశాలను సమీక్షించి చట్టపరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ‘అమర రాజా బ్యాటరీస్‌’ తెలిపింది. ‘‘బాధ్యతాయుత సంస్థగా ఎన్నో సంవత్సరాలుగా మా యూనిట్లలో పర్యావరణ సంరక్షణకు అనేక చర్యలు తీసుకున్నాం. కాలుష్య నియంత్రణ కోసం చెప్పుకోదగ్గ స్థాయిలో పెట్టుబడులు కూడా పెట్టాం’’ అని పేర్కొంది. అమర రాజా బ్యాటరీస్‌కు చిత్తూరు జిల్లాలోని తిరుపతి, కరకంబాడి, నూనెగుండ్లపల్లి వద్ద తయారీ యూనిట్లు ఉన్నాయి.

Updated Date - 2021-05-01T17:37:34+05:30 IST