తిరుమలలో టాస్క్ఫోర్స్ బృందానికి తారసపడిన తమిళ స్మగ్లర్లు
ABN , First Publish Date - 2021-12-30T19:35:03+05:30 IST
తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహించారు.
తిరుపతి : తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. వినాయకుని ఆలయం సమీపంలో కల్వర్టు వద్ద తమిళ స్మగ్లర్లు తారాపడ్డారు. టాస్క్ ఫోర్స్ బృందాన్ని చూసి ఎర్రచందనం దుంగలను వదిలేసి పారిపోయారు. రూ.40 లక్షల విలువైన 23 ఎర్రచందనం దుంగలను టాస్క్ పోర్స్ ఎస్పీ సుందరరావు సీజ్ చేశారు.