Ap Highcourt మధ్యంతర ఉత్తర్వులు.. రాజమండ్రి జైలుకు ధూళిపాళ్ల నరేంద్ర
ABN , First Publish Date - 2021-05-02T23:57:12+05:30 IST
Ap Highcourt మధ్యంతర ఉత్తర్వులు.. రాజమండ్రి జైలుకు ధూళిపాళ్ల నరేంద్ర
అమరావతి: టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను విజయవాడ జైలు నుండి రాజమండ్రి జైలుకు తరలించారు. సంగం డెయిరీలో అవకతవకలు, ఫోర్జరీ కేసులో ధూళిపాళ్ల కస్టడీ పిటిషన్పై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఆయనను విజయవాడ జైలు నుంచి రాజమండ్రి జైలుకు తరలించారు. ఇప్పటికే ఈ కేసులో ధూళిపాళ్లను 4 రోజులపాటు విచారించేందుకు ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. శనివారం రాజమండ్రి జైలునుండి విజయవాడ ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఏసీబీ కస్టడీ పిటిషన్ను సవాల్ చేస్తూ ధూళిపాళ్ల న్యాయవాది హైకోర్టులో హౌస్ మోషన్ దాఖలు చేశారు. ఇక ఇదే కేసులో ధూళిపాళ్లతో పాటు గోపాలకృష్ణ, గురునాధం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.