దుర్గగుడి కేశఖండనశాలలో మహిళలకు ప్రాతినిధ్యం
ABN , First Publish Date - 2021-12-19T17:58:36+05:30 IST
ప్రముఖ పుణ్యక్షేత్రం కనకదుర్గమ్మ ఆలయంలోని కేశఖండనశాలలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించే దిశగా అడుగులు పడుతున్నాయి.
విజయవాడ: ప్రముఖ పుణ్యక్షేత్రం కనకదుర్గమ్మ ఆలయంలోని కేశఖండనశాలలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించే దిశగా అడుగులు పడుతున్నాయి. కేశఖండన శాలలో మహిళలకు అవకాశం కల్పించాలని మంత్రి వెలంపల్లిని దుర్గగుడి పాలకమండలి సభ్యురాలు కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ విషయంపై దేవాదాయశాఖ కమిషనర్, దుర్గగుడి ఈవో మధ్య చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే దుర్గగుడి కేశఖండన శాలలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించే అవకాశం ఉంది. తిరుమల, శ్రీశైలం కేశఖండనశాలలో మహిళలు విధులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంద్రకీలాద్రికి మహిళా క్షురకులను నియమించాలని మహిళా భక్తులు కోరుతున్నారు.