అదానీప్రదేశ్గా మార్చేస్తారేమో?: సీపీఐ రామకృష్ణ
ABN , First Publish Date - 2021-12-08T07:58:44+05:30 IST
అదానీప్రదేశ్గా మార్చేస్తారేమో?: సీపీఐ రామకృష్ణ
కడప (రవీంద్రనగర్), డిసెంబరు 7: వరదలతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును అదానీకి అప్పగించడం అతి పెద్ద స్కామ్ అని, త్వరలో ఏపీని అదానీప్రదేశ్గా మార్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని వ్యాఖ్యానించారు. ఉద్యోగుల సమస్యలపై రాష్ట్రప్రభుత్వ వైఖరిని ఆ పార్టీ సహాయ కార్యదర్శి జి.ఓబులేసు తప్పుబట్టారు. కాగా, అన్నమయ్య ప్రాజెక్ట్ను కేంద్ర ప్రభుత్వమే పునర్నిర్మించాలని సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.