కొత్త ఫీచర్లతో మూడు వేరియంట్లలో ఇండియన్ చీఫ్ లైనప్ బైక్స్
ABN , First Publish Date - 2021-08-21T22:52:11+05:30 IST
కొత్త ఫీచర్లతో మూడు వేరియంట్లలో ఇండియన్ చీఫ్ లైనప్ బైక్స్
న్యూఢిల్లీ: ప్రముఖ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ అమెరికన్ మోటార్సైకిల్ బ్రాండ్ ఇండియన్ మోటార్సైకిల్ తన కొత్త ఇండియన్ చీఫ్ లైనప్ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. సరికొత్త మోడల్లో ఇండియన్ చీఫ్ లైనప్ బైక్లను విడుదల చేయనున్నట్లు సంస్థ తెలిపింది. భారత మార్కెట్లో ఆగస్టు 27, 2021న ప్రారంభించబోతోంది. కొత్త చీఫ్ లైనప్లో మూడు మోడళ్లు ఉంటాయని, అవి చీఫ్ డార్క్ హార్స్, చీఫ్ బాబర్ డార్క్ హార్స్ మరియు సూపర్ చీఫ్ లిమిటెడ్ బైక్లు మార్కెట్లోకి రానున్నాయి.. ద్విచక్ర వాహన తయారీదారు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో బైక్ల రాకను అధికారికంగా ధృవీకరించారు.
అదనంగా 2022 ఇండియన్ చీఫ్ మోడల్ రేంజ్ బైక్ల కోసం ప్రీ-బుకింగ్లు ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న అధికారిక భారతీయ డీలర్షిప్లలో 3 లక్షల టోకెన్స్ ప్రారంభమయ్యాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో కంపెనీ భారతదేశంలో 2022 చీఫ్ లైనప్ ధరలను ప్రకటించింది, ఈ బైక్ రూ. 20.75 లక్షలతో (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతుందని సంస్థ తెలిపింది.