PRC అమలులోనూ జాప్యమేనా: శైలజానాథ్
ABN , First Publish Date - 2021-10-07T14:17:28+05:30 IST
ప్రభుత్వ ఉద్యోగుల వేతన..
అమరావతి, అనంతపురం, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణలోనూ జాప్యమేనా..! అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ప్రశ్నించారు. ‘‘ప్రభుత్వోద్యోగులందరూ ధనవంతులు కారు. సంఘం నేతలు కొందరు స్వార్థంతో రాజకీయ పార్టీలకు మద్దతు పలుకుతూ ఉద్యోగులను బలి చేస్తున్నారు. తాజాగా ఒక ఉద్యోగ సంఘం నేత పదవి కోసం ఉద్యోగులను పణంగా పెట్టే ప్రయత్నం చేయడం శోచనీయం’’ అని ఓ ప్రకటనలో విమర్శించారు.