దక్షిణాఫ్రికా అత్యున్నత ధర్మాసనానికి జడ్జిగా భారతీయ సంతతి వ్యక్తి ఎంపిక
ABN , First Publish Date - 2021-12-26T02:03:06+05:30 IST
దక్షిణాఫ్రికాలో అత్యున్నత ధర్మాసనమైన కాంస్టిట్యూషన్ కోర్టుకు న్యాయమూర్తిగా ఓ భారతీయ సంతతికి చెందిన వ్యక్తి ఎంపికయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికాలో అత్యున్నత ధర్మాసనమైన కాంస్టిట్యూషన్ కోర్టుకు న్యాయమూర్తిగా ఓ భారతీయ సంతతికి చెందిన వ్యక్తి ఎంపికయ్యారు. నరేంద్రన్ జోడీ కొల్లాపెన్ను న్యాయమూర్తిగా ఎంపిక చేసినట్టు దేశాధ్యక్షుడు సిరిల్ రామఫోనా తాజాగా ప్రకటించారు. సుదీర్ఘ ఇంటర్వ్యూల అనంతరం నరేంద్రన్తో పాటూ రమాకా మథూపో రాజ్యంగ కోర్టులో న్యాయమూర్తులుగా బాధ్యతలు చేపట్టనున్నారు. న్యాయవాద వృత్తిలో ఈ ఇద్దరూ విశేష కృషి చేశారని అధ్యక్షుడు రామఫోసా ప్రసంసించారు.