Asian Champions Trophy Hockey: కొనసాగుతున్న భారత్ దూకుడు
ABN , First Publish Date - 2021-12-20T02:04:44+05:30 IST
ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీ హాకీలో భారత జట్టు దూకుడు కొనసాగుతోంది. నేడు జపానత్తో జరిగిన చివరి
ఢాకా: ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీ హాకీలో భారత జట్టు దూకుడు కొనసాగుతోంది. నేడు జపానత్తో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్లో భారత్ గోల్స్తో చెలరేగిపోయింది. 6-0తో విజయం సాధించింది. హర్మన్ప్రీత్ సింగ్ మరోమారు అదరగొట్టాడు. 10వ, 53వ నిమిషంలో బ్రేస్ గోల్స్ చేయగా, దిల్ప్రీత్ సింగ్ 23వ నిమిషంలో, జరామన్ప్రీత్ సింగ్ 34వ నిమిషంలో, సుమిత్ 46వ నిమిషంలో, షంషేర్ సింగ్ 54వ నిమిషంలో గోల్స్ సాధించి భారత్కు అద్భుత విజయాన్ని అందించారు.
ఈ విజయంతో భారత్ రౌండ్ రాబిన్ స్టేజ్ను 10 పాయింట్లతో ముగించి అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో కొరియా (6), జపాన్ (5), పాకిస్థాన్ (2) ఉండగా, ఆతిథ్య బంగ్లాదేశ్ ఖాతా కూడా తెరవలేదు.