గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు
ABN , First Publish Date - 2021-02-05T07:04:07+05:30 IST
గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు
వెంకటాపురం(నూగూరు), ఫిబ్రవరి 4 : మండలంలోని పాత్రా పురం పంచాయతీ పరిధిలోని పాలెంవాగు అటవీ ప్రాంతంలోని గుడుం బా స్థావరాలపై గురువారం ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. ఎక్సైజ్ ఎస్సై అశోక్ వివరాల మేరకు..పాలెంవాగు సమీ పంలోని అటవీ ప్రాంతంలో తనిఖీలు చేపట్టి ప్లాస్టిక్ డ్రమ్ముల్లో నిల్వ చేసిన 3వేల లీటర్ల బెల్లంపానకం ధ్వంసం చేశారు. 50కిలో ల నల్లబెల్లం, 20 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు.