విద్యుదాఘాతంతో రైతుకు తీవ్ర గాయాలు
ABN , First Publish Date - 2021-02-08T05:50:31+05:30 IST
విద్యుదాఘాతంతో రైతుకు తీవ్ర గాయాలు
కురవి, ఫిబ్రవరి 7 : మండలంలోని ఉప్పరగూడెం శివారు బురు గుచెక్క తండా గ్రామాంలోని రైతుకు విద్యుదాఘాతం కారణంగా తీవ్ర గాయాలయ్యాయి. తండాకు చెందిన బానోతు భక్ష గ్రామంలో ని సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్కు ఫీజు వేసేందుకు వెళ్లి విద్యుదా ఘాతానికి గురై, స్తంభం మీద నుంచి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన భక్షను స్థానికులు మహబూబాబాద్ ఆస్పత్రికి తరలిం చారు. పరిస్థితి విషమించడంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.