మెదక్లో ఆర్టీపీసీఆర్ కేంద్రాన్ని ప్రారంభించిన హరీష్రావు
ABN , First Publish Date - 2021-06-06T21:44:47+05:30 IST
మెదక్లో ఆర్టీపీసీఆర్ కేంద్రాన్ని మంత్రి హరీష్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ
![మెదక్లో ఆర్టీపీసీఆర్ కేంద్రాన్ని ప్రారంభించిన హరీష్రావు](https://media.andhrajyothy.com/appimg/galleries/1921060604080665/06062021161442n93.jpg)
మెదక్: మెదక్లో ఆర్టీపీసీఆర్ కేంద్రాన్ని మంత్రి హరీష్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ గతేడాది మెదక్ రైల్వే పనులకోసం సీఎం కేసీఆర్ 40 కోట్లు విడుదల చేశారని తెలిపారు. మరో 25 కోట్లు ఇస్తే అక్కన్నపేట-మెదక్ రైల్వే లైన్ పనులు పూర్తవుతాయని చెప్పారు. ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంపు పనులు, భూ సేకరణకు అవసరమైన.. 55 కోట్లను కేసీఆర్ను కలిసి మంజూరు చేయించుకుంటామని హరీష్రావు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, కలెక్టర్ హరీష్ పాల్గొన్నారు.