‘రాయలసీమ లిఫ్ట్’పై జగన్ది మోసం: శ్రీనివాస్గౌడ్
ABN , First Publish Date - 2021-06-22T07:36:35+05:30 IST
‘‘కొత్తగా నీటి కేటాయింపులు జరగనంతవరకూ రాయలసీమ లిఫ్ట్ పథకాన్ని మొదలుపెట్టబోమని అపెక్స్ కౌన్సిల్లో కేంద్ర మంత్రికి ఏపీ సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
హైదరాబాద్, జూన్ 21(ఆంధ్రజ్యోతి): ‘‘కొత్తగా నీటి కేటాయింపులు జరగనంతవరకూ రాయలసీమ లిఫ్ట్ పథకాన్ని మొదలుపెట్టబోమని అపెక్స్ కౌన్సిల్లో కేంద్ర మంత్రికి ఏపీ సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని తుంగలోకి తొక్కి మోసం చేస్తున్నారు’’ అంటూ మంత్రి శ్రీనివా్సగౌడ్ ధ్వజమెత్తారు. టీఆర్ఎ్సఎల్పీలో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ జగన్ను ఒక తమ్ముడిగా భావించిన సీఎం కేసీఆర్ స్నేహహస్తం అందించారని, కానీ ఆయన సరిగా స్పందించలేదని విమర్శించారు.