ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 11 మందికి కొవిడ్
ABN , First Publish Date - 2021-02-09T04:30:44+05:30 IST
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 11 మందికి కొవిడ్
కొత్తగూడెం కలెక్టరేట్/ఖమ్మం సంక్షేమవిభాగం, ఫిబ్రవరి 8: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం 11 మంది కొవిడ్ బారిన పడినట్టు నిర్ధారణైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 679 మందికి పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి కరోనా పాజిటివ్ వచ్చిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఇక ఖమ్మం జిల్లాలో నాలుగు పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ అధికారులు తమ రోజువారీ నివేదికలో వెల్లడించారు.