ఎమ్మెల్సీ నామినేషన్ కు ప్రజా ప్రతినిధులు తరలిరావాలి: మంత్రి ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2021-02-22T01:24:39+05:30 IST

ఈ నెల 23వ తేదీన నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల టీఆరెఎస్ పార్టీ

ఎమ్మెల్సీ నామినేషన్ కు ప్రజా ప్రతినిధులు తరలిరావాలి: మంత్రి ఎర్రబెల్లి

వరంగల్: ఈ నెల 23వ తేదీన నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల టీఆరెఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి నామినేషన్ వేసే కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధులు తరలి రావాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం 10గంటలకు జరిగే నామినేషన్ కార్యక్రమo టీఆరెఎస్ గెలుపు ని ఖాయం చేసే విధంగా ఉండాలని మంత్రి అభిప్రాయపడ్డారు.


పార్టీకి చెందిన ఉమ్మడి వరంగల్ జిల్లా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గాల పార్టీ ఇంచార్జీ లు, జెడ్పీ చైర్మన్లు, మేయర్, మున్సిపల్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్, ఐడీసీఎంఎస్ చైర్మన్లు, వైస్ చైర్మన్ లు, రైతు బంధు సమితి జిల్లా, మండల అధ్యక్షులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అభిమానులు తరలి వచ్చి పాల్గొనాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు.

Updated Date - 2021-02-22T01:24:39+05:30 IST