హిందువుకు అంత్యక్రియలు చేసిన ముస్లింలు
ABN , First Publish Date - 2021-05-31T06:17:30+05:30 IST
హిందువుకు అంత్యక్రియలు చేసిన ముస్లింలు
భూపాలపల్లిటౌన్, మే 30 : ఓ హిందూ వ్యక్తికి ముస్లింలు దహన సంస్కారాలు చేశారు. అనారోగ్యంతో మృతి చెందిన అతడికి కరోనా ఉందోమోననే అనుమానంతో ఎవరూ ముందుకు రాకపోవడంతో మసీదు కమిటీ ఆధ్వర్యంలో పలువురు అంత్యక్రియలు చేసి ఔదార్యాన్ని చాటుకున్నారు. భూపాలపల్లి పట్టణంలోని పెద్దకుంటపల్లికి చెందిన బానోతు సురేష్(32) కొంత కాలంగా తీవ్ర అనారోగ్యానికి గురై ఆదివారం మృతి చెందాడు. ఆయనకు తల్లిదండ్రులు, భార్య, పిల్లలు ఉన్నారు. కకుటుంబ సభ్యులు దహన సంస్కారాలు చేయడానికి ముందుకు రాలేదు. ఈ క్రమంలో ఆ వార్డు కౌన్సిలర్ రజిత ద్వారా సమాచారం అందుకున్న ముస్లింలు అక్కడికి చేరుకున్నారు. పీపీఈ కిట్లు ధరించి దహన సంస్కారాలు చేశారు. ఒక హిందువుకు ఆయన సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేయడం పట్ల స్థానికులు అభినందించారు. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు తమకు సమాచారం అందిస్తే దహన సంస్కారాలు చేస్తామని మసీదు నిర్వాహక కమిటీ అధ్యక్షుడు సాదిక్ తెలిపారు.