మంత్రి సత్యవతి బంధువు కోసమే..!
ABN , First Publish Date - 2021-02-17T08:39:42+05:30 IST
రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బంధువు కోసమే తనను అకారణంగా డిప్యుటేషన్పై పంపిస్తున్నారని జిల్లా ఆస్పత్రి పూర్వ సూపరింటెండెంట్ డాక్టర్ బీంసాగర్ ఆరోపించారు.
నన్ను డిప్యుటేషన్పై పంపారు: డాక్టర్ భీంసాగర్
మహబూబాబాద్, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బంధువు కోసమే తనను అకారణంగా డిప్యుటేషన్పై పంపిస్తున్నారని జిల్లా ఆస్పత్రి పూర్వ సూపరింటెండెంట్ డాక్టర్ బీంసాగర్ ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను అనార్యోగంగా ఉన్నానని, పదవీ విరమణకు 16 నెలలు గడువు మాత్రమే ఉందని వాపోయారు. పదోన్నతి కల్పించి బదిలీ చేసినా బాగుండేదని.. కానీ వైద్యవిధాన పరిషత్ రాష్ట ప్రోగ్రాం ఆఫీసర్, జాయింట్ కమిషనర్గా డిప్యుటేషన్పై పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కుమారుడు, ఛాతీ వైద్య నిపుణుడు డాక్టర్ సతీష్ వారం రోజులు మాత్రమే విధులకు వస్తారని ఆరోపించారు. అయితే నెలరోజుల వేతనం ఇవ్వాలని ఒత్తిడి తెచ్చేవారని, అలా చేయకపోవడంతో తనను టార్గెట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.b