హోంగార్డుల కుటుంబాలకు ఆర్థికసాయం
ABN , First Publish Date - 2021-12-07T05:32:47+05:30 IST
హోంగార్డుల కుటుంబాలకు ఆర్థికసాయం
వికారాబాద్: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన హోంగార్డు కుటుంబ సభ్యులకు ఎస్పీ నారాయణ సోమవారం ఆర్థికసాయం అందజేశారు. చేవెళ్ల సబ్డివిజన్ హోంగార్డులు చారి, రాజు మృతిచెందడంతో ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ, అదనపు ఎస్పీ రషీద్ చేతుల మీదుగా ఆర్థికసాయం చేశారు. ఏఆ ర్ డీఎస్పీ సత్యనారాయణ, ఆర్ఐ అచ్యుతరావు, హోంగార్డు యూనియన్ అధ్యక్షుడు చాంద్పాషా, ప్రధాన కార్యదర్శి విశ్వనాథం, అనంతయ్య, సుధాకర్, దేవకుమార్ పాల్గొన్నారు.