మందకృష్ణకు శస్త్ర చికిత్స
ABN , First Publish Date - 2021-08-10T07:13:29+05:30 IST
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కుడికాలుకు శస్త్రచికిత్స జరిగిందని ఎంఎ్సఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
హైదరాబాద్, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కుడికాలుకు శస్త్రచికిత్స జరిగిందని ఎంఎ్సఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేశ్ మాదిగ తెలిపారు. ఆయన ఇటీవల ఢిల్లీలో హోటల్ రూంలో కాలుజారి పడిన సమయంలో కుడికాలి ఎముక విరిగిందని తెలిపారు. దీంతో సోమవారం ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో ఆయనకు శస్త్ర చికిత్స చేశారని, ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని తెలిపారు.