సూర్యాపేట ఘటన బాధాకరం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
ABN , First Publish Date - 2021-03-23T03:43:23+05:30 IST
సూర్యాపేట ఘటన బాధాకరం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
నల్గొండ: సూర్యాపేట ఘటన బాధాకరమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. ఇంతమంది గాయపడడం అత్యంత శోచనీయమన్నారు. గ్యాలరీకి ఏ ప్రతిపాదికన అనుమతులు ఇచ్చారని ఉత్తమ్ ప్రశ్నించారు. ఘటనకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్షతగాత్రులకు వైద్యసదుపాయాలు అందించాలని ఉత్తమ్ సూచించారు.