మరో వివాదంలో TRS MLA.. పోలీసులకు మహిళా నేత ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-09-05T17:46:47+05:30 IST

టీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు.

మరో వివాదంలో TRS MLA.. పోలీసులకు మహిళా నేత ఫిర్యాదు

మంచిర్యాల : టీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. తననూ, తన కుమారుడిని చంపుతానని ఫోన్లో బెదిరించారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేపై అదే పార్టీకి చెందిన మహిళా నేత పద్మా రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేపై సొంత పార్టీకి చెందిన నేతే.. అది కూడా మహిళ ఫిర్యాదు చేయడం ప్రస్తుతం మంచిర్యాలలో తీవ్ర దుమారం రేపుతోంది. నిన్న రాత్రి తనకు ఫోన్ చేసిన ఎమ్మెల్యే అసభ్యంగా దూషించడంతో పాటు చంపుతానని బెదిరించాడని పద్మా రెడ్డి పోలీసులను ఆశ్రయించారు.


అసలేం జరిగింది..!?

ఎమ్మెల్యేతో తనకు ప్రాణ హాని ఉందని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై అమెరికాలో ఉండే తన కొడుకు.. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారని.. ఇది మనసులో పెట్టుకున్న ఎమ్మెల్యే తననూ.. తన కొడుకునూ చంపుతానని ఫోన్లో బెదిరించాడని పద్మా రెడ్డి ఆరోపించారు. గతంలో కూడా మూడు సార్లు ఇదే విధంగా ఎమ్మెల్యేతో పాటు అనుచరులు బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నుంచి తనకు, తన కుమారుడికి ప్రాణ హాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈయనపై ఇప్పటికే పలు భూ వివాదాలు రావడం.. అంతేకాకుండా కౌన్సిలర్ కుమార్తెను బెదిరించినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన విషయం విదితమే. తాజాగా మరో వివాదంలో చిక్కుకోవడంతో వరుస వివాదాలతో ఎమ్మెల్యే ఇమేజ్‌కే వచ్చే అవకాశాలున్నాయి.



Updated Date - 2021-09-05T17:46:47+05:30 IST