మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని కలిసిన ఎమ్మెల్యేలు
ABN , First Publish Date - 2021-02-08T20:19:04+05:30 IST
తమనియోజకవర్గానికి చెందిన సమస్యలపై మంత్రితో చర్చించేందుకు పలువురు ఎమ్మెల్యేలు మంత్రి ఎర్రబెల్లిని కలిశారు.
వరంగల్: తమనియోజకవర్గానికి చెందిన సమస్యలపై మంత్రితో చర్చించేందుకు పలువురు ఎమ్మెల్యేలు మంత్రి ఎర్రబెల్లిని కలిశారు. ఆయా సమస్యల పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకుంటానని తెలిపారు. మంత్రి ఎర్రబెల్లిని కలిసిన వారిలో చెన్నూరు ఎమ్మెల్యే,విప్ బాల్క సుమన్,సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య,మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్,అలంపూర్ ఎమ్మెల్యే ఇబ్రహీం, దేవరకద్ర ఎమ్మెల్యే అల వెంకటేశ్వర్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి తదితరులు ఉన్నారు.