వైభవంగా వీరభద్రస్వామి కల్యాణోత్సవం
ABN , First Publish Date - 2021-01-14T04:09:14+05:30 IST
వైభవంగా వీరభద్రస్వామి కల్యాణోత్సవం
ఏటూరునాగారం, జనవరి 13: ఏటూరునాగారంలోని అభినయ వీరభద్రస్వామి ఆలయంలో బుధవారం వైభవంగా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 6.10 గంటలకు గణపతి పూజను అర్చకుడు పోసగంటి రాజ్కుమార్ నిర్వహించారు. అర్చకులు వీరభద్రస్వామికి అభిషేకాలు, అర్చనలు చేశారు. మధ్యాహ్నం 12.30 గంటలకు వీరభద్రస్వామి, భద్రకాళి మాతకు వేద మంత్రోచ్ఛరణల నడుమ కల్యాణం జరిపించారు. ఈ ఉత్సవాలకు ఆకులవారిఘణపురం, క్రాస్రోడ్డు, ఎక్కెల, భూటారం, తాళ్లగడ్డ తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరాగా, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. సాయంత్రం పురవీధుల్లో భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ప్రతిమలను పల్లకిలో ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బల్ల భద్రయ్య, కురుకు సాంబయ్య, పద్మ, మనోహర్, ప్రవీణ్, శంకర్, పోలాసి రత్నాకర్, నాగేశ్వరరావు, స్వరూప, గాజుల లలిత, సోలం సత్యం, ఆరుణ, చిప్ప అశోక్, మెరుగు సత్యం, బచ్చు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.