వేతన బకాయిలు చెల్లించాలి: జూలకంటి లేఖ
ABN , First Publish Date - 2021-05-18T08:55:27+05:30 IST
మధ్యాహ్న భోజన కార్మికులకు వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి కోరారు.
హైదరాబాద్, (ఆంధ్రజ్యోతి): మధ్యాహ్న భోజన కార్మికులకు వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్కు లేఖను రాశారు. వీరికిచ్చే స్వల్పవేతనాలు ఏడాది నుంచి చెల్లించక పోవడంతో కుటుంబాలు వీధిన పడినట్టు తెలిపారు. బకాయి పడిన 12 కోట్లు తక్షణం విడుదల చేయాలని కోరారు.