Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వైఎస్ భారతి, విసాయిరెడ్డి పాత్ర: అనురాధ
ABN , First Publish Date - 2022-09-05T21:03:06+05:30 IST
ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam)లో వైఎస్ భారతి (YS Bharathi), ఎంపీ విజయసాయి పాత్ర ఉందని టీడీపీ నేత పంచుమర్తి అనురాధ
విజయవాడ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam)లో వైఎస్ భారతి (YS Bharathi), ఎంపీ విజయసాయి పాత్ర ఉందని టీడీపీ నేత పంచుమర్తి అనురాధ (Panchumarthi Anuradha) ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీబీఐ వేసే ఛార్జిషీట్లతో తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదలుతాయని తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సీఎం జగన్ (CM Jagan) అవినీతిని వెల్లడించామనే తమపై కక్ష కట్టారని దుయ్యబట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) కుటుంబంపై వైసీపీ నేతల దూషణలు సిగ్గుచేటన్నారు. నారా భువనేశ్వరి, బ్రహ్మణిపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ ట్రస్ట్, హెరిటేజ్ ద్వారా ప్రజా సేవ చేస్తున్న వారిపై ఆరోపణలా? అని అనురాధ ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్ నుంచి తన వాళ్లను కాపాడేందుకే జగన్ ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు. లిక్కర్ స్కామ్లో ఎవరి పాత్ర ఏంటో కేంద్రం నిగ్గు తేల్చాలని పంచుమర్తి అనురాధ డిమాండ్ చేశారు.