Justice DY Chandrachud: ఏపీ జుడీషియల్ అకాడమీని ప్రారంభించిన సీజేఐ

ABN , First Publish Date - 2022-12-30T11:17:23+05:30 IST

గుంటూరు జిల్లా: మంగళగిరి మండలం, ఖాజాలో ఏపీ జుడీషియల్ అకాడమీతోపాటు ట్రైనీ జుడీషియల్ ఆఫీసర్స్‌కు ఓరియంటేషన్ ప్రోగ్రాంను సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ప్రారంభించారు.

Justice DY Chandrachud: ఏపీ జుడీషియల్ అకాడమీని ప్రారంభించిన సీజేఐ

గుంటూరు జిల్లా: మంగళగిరి (Mangalagiri) మండలం, ఖాజాలో ఏపీ జుడీషియల్ అకాడమీ (AP Judicial Academy)తోపాటు ట్రైనీ జుడీషియల్ ఆఫీసర్స్‌కు ఓరియంటేషన్ ప్రోగ్రాం (Orientation Program)ను సుప్రీంకోర్టు (Supreme Court) ఛీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ (Justice DY Chandrachud) శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయాధికారులను ఉద్దేశించి సీజేఐ చంద్రచూడ్‌ ప్రసంగించారు. తర్వాత హైకోర్టు (High Court) డిజిటైజేషన్ ఆఫ్ రికార్డ్స్ కోసం డిజిటైజేషన్ సెంటర్‌ (Digitization Centre)కు శంఖుస్ధాపన చేయనున్నారు. అలాగే ఏపీ హైకోర్టు వార్షిక నివేదికను సీజేఐ (CJI) విడుదల చేయనున్నారు. అనంతరం ఆన్‌లైన్ సర్టిఫైడ్ కాపీల జారీకి సాప్ట్ వేర్ అప్లికేషన్‌, న్యూట్రల్ సైటెషన్‌ను(అనులేఖనం) ఆయన ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా (Prashant Kumar Mishra), న్యాయమూర్తులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T11:17:34+05:30 IST