హైకోర్టు రిజిస్ట్రార్‌గా హరిహరనాథ శర్మ

ABN , First Publish Date - 2022-09-18T09:37:35+05:30 IST

విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి అవధానం హరిహరనాథశర్మ రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్‌గా బదిలీ అయ్యారు. అలాగే

హైకోర్టు రిజిస్ట్రార్‌గా హరిహరనాథ శర్మ

అమరావతి, విశాఖపట్నం, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి  అవధానం హరిహరనాథశర్మ రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్‌గా బదిలీ అయ్యారు. అలాగే, కొత్తగా ఏర్పాటు చేయనున్న ఏపీ జ్యుడీషియల్‌ అకాడమీకి ఆయన ఇన్‌చార్జిగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు హైకోర్టు ఇన్‌చార్జి రిజిస్ర్టార్‌ గంధం సునీత ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి శ్రీదేవికి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పూర్తి బాధ్యతలు అప్పగించి ఈ నెల 30వ తేదీలోగా విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హరిహరనాథశర్మను పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు అభినందించారు.

Updated Date - 2022-09-18T09:37:35+05:30 IST