Ayyanna Patrudu: విజయసాయి ఫోన్‌ దొరకాలని శ్రీవారిని కోరుకున్నా: అయ్యన్న

ABN , First Publish Date - 2022-11-25T20:38:11+05:30 IST

ఏ2 విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) ఫోన్‌ త్వరగా దొరకాలని వేంకటేశ్వరస్వామిని ప్రార్థించా’ అని టీడీపీ సీనియర్‌ నాయకుడు అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) తెలిపారు.

Ayyanna Patrudu: విజయసాయి ఫోన్‌ దొరకాలని శ్రీవారిని కోరుకున్నా: అయ్యన్న

తిరుమల: ‘ఏ2 విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) ఫోన్‌ త్వరగా దొరకాలని వేంకటేశ్వరస్వామిని ప్రార్థించా’ అని టీడీపీ సీనియర్‌ నాయకుడు అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) తెలిపారు. శుక్రవారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. ‘విజయసాయిరెడ్డి ఫోన్‌ కనిపించడం లేదని పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ ఫోన్‌లో చాలా ఆధారాలున్నాయి. ఢిల్లీ సారా కుంభకోణం, విశాఖ భూ కుంభకోణాలు వంటివి ఆ ఫోన్‌లోనే ఉన్నాయి. పోయిన ఫోన్‌ దొరికితే విజయసాయిరెడ్డి ఆస్తులు జప్తు అవుతాయి. దాని ద్వారా రాష్ట్రానికి మేలు జరుగుతుంది’ అని అయ్యన్నపాత్రుడు అన్నారు. ఈ క్రమంలో త్వరగా ఫోన్‌ దొరికించే ఏర్పాటు చేయామని వేంకటేశ్వరస్వామిని వేడుకున్నానన్నారు. అలాగే దుర్మార్గమైన పాలన నుంచి రాష్ర్టాన్ని విముక్తి చేసి పిల్లల భవిష్యత్తును కాపాడాలని కోరుకున్నట్టు అయ్యన్నపాత్రుడు తెలిపారు.

Updated Date - 2022-11-25T20:38:12+05:30 IST