ఎంత దారుణం జరిగింది.. తండ్రి కళ్ళముందే ఏడాది పిల్లాడిని తినేసిన మొసలి..

ABN , First Publish Date - 2022-12-04T10:48:08+05:30 IST

ఏం చేయాలో ఆలోచించుకునేలోపే ఆ మొసలి పిల్లాడిని తన దవడలతో పట్టుకుంది

ఎంత దారుణం జరిగింది.. తండ్రి కళ్ళముందే ఏడాది పిల్లాడిని తినేసిన మొసలి..

ఓ తండ్రి తన ఏడాది కొడుకును తీసుకుని చేపలు పట్టడానికి వారి గ్రామానికి దగ్గరలో ఉన్న నదికి వెళ్ళాడు. అయితే అక్కడ విషాదం చోటుచేసుకుంది. ఏడాది వయసున్న అతని కొడుకును మొసలి తినేసింది. హృదయాన్ని కలచివేసే ఈ సంఘటనకు సంబంధించి వివరాలలోకి వెళితే..

crok.jpg

మలేషియా దేశంలోని లహద్ దాతు సబాలో నివసిస్తున్న ఓ వ్యక్తి తనకు దగ్గరలో ఉన్న నదికి చేపలు పట్టడం కోసం వెళ్ళాడు. అక్కడ అతను పడవలో నీటిలోకి వెళ్ళి చేపలు పడుతుండగా ఒక్కసారిగా ఓ మొసలి అతని మీదా, అతని ఏడాది కొడుకు మీదా దాడి చేసింది. ఊహించని ఈ సంఘటనకు అతను షాక్ కు గురయ్యాడు. ఏం చేయాలో ఆలోచించుకునేలోపే ఆ మొసలి పిల్లాడిని తన దవడలతో పట్టుకుంది. అది చూసి అతను భయాందోళనకు గురయ్యాడు. పిల్లాడిని కాపాడే ప్రయత్నం చేశాడు, కానీ మొసలికి అతనికి మధ్య జరిగిన పెనుగులాటలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. పిల్లాడు మాత్రం అతని చేతికి దొరకలేదు. చివరికి మొసలి పిల్లాడిని నీటిలోకి లాక్కెళ్ళిపోయింది. తన కొడుకును తన కళ్ల ముందే అలా మొసలి నీటిలోకి లాక్కేళ్తుంటే.. గుండెలవిసెలా రోదిస్తూ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు.విషయం తెలుసుకున్న స్థానికులు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. స్పెషల్ పోలీసులు అక్కడికి చేరుకుని పిల్లాడి మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్ళు ఏమైనా దొరుకుతాయేమోనని వెతుకులాట మొదలుపెట్టారు. ఈ సంఘటన గురించి తెలిసిన నెటిజన్లు అయ్యో పాపం అనుకుంటున్నారు.

Updated Date - 2022-12-04T10:52:59+05:30 IST