Viral Video: దువ్వాడ స్టేషన్ ఘటన రిపీట్.. అక్కడ అదృష్టవశాత్తు యువకుడు సేఫ్!

ABN , First Publish Date - 2022-12-25T11:26:01+05:30 IST

మొన్నటికి మొన్న రైలు దిగుతూ అన్నవరానికి చెందిన 20ఏళ్ల శశికళ(Shashikala).. దువ్వాడ స్టేషన్‌(Duvvada Railway Station)లో ట్రైన్-ప్లాట్‌ఫామ్ మధ్య ఇరుక్కుపోయింది. రెస్కూ సిబ్బంది దాదాపు గంటన్నరపాటు శ్రమించి ఆమెను బయటకు తీసి.. చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ ఆ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందన్న విషయం తెలిసిందే. అయితే..

Viral Video: దువ్వాడ స్టేషన్ ఘటన రిపీట్.. అక్కడ అదృష్టవశాత్తు యువకుడు సేఫ్!

ఇంటర్నెట్ డెస్క్: మొన్నటికి మొన్న రైలు దిగుతూ అన్నవరానికి చెందిన 20ఏళ్ల శశికళ(Shashikala).. దువ్వాడ స్టేషన్‌(Duvvada Railway Station)లో ట్రైన్-ప్లాట్‌ఫామ్ మధ్య ఇరుక్కుపోయింది. రెస్క్యూ సిబ్బంది దాదాపు గంటన్నరపాటు శ్రమించి ఆమెను బయటకు తీసి.. చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ ఆ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందన్న విషయం తెలిసిందే. అయితే.. ఇటువంటి ఘటనే తాజాగా చోటు చేసుకుంది. స్టేషన్‌ నుంచి బయల్దేరిన రైలును ఎక్కబోయి.. ఓ యువకుడు రైలు, ప్లాట్‌ఫామ్ మధ్యలో ఇరుక్కుపోయాడు(Stuck Between Train and Platform). అదృష్టవశాత్తు ఆ యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ ఘటన ముంబైలోని రైల్వే స్టేషన్‌(Mumbai Railway Station)లో చోటు చేసుకుంది. రైలు ప్లాట్‌ఫామ్ మీద రైలు బయల్దేరడానికి సిద్ధంగా ఉంది. ఇదే సమయంలో ఓ ప్రయాణికుడు ట్రైన్ దిగి, పక్కనే ఉన్న దుకాణం వద్దకు వెళ్లాడు. అక్కడ కొన్ని పానీయాలు కొనుగోలు చేశాడు. ఇంతలో రైలు బయల్దేరింది. అది యువకుడు గమనించాడు. ఇంతలోనే రైలు కాస్త వేగం పెరిగింది. ఈ క్రమంలో సదరు యువకుడు ఒక చేతిలో పానీయాలు పట్టుకుని రైలు వైపు పరుగులు తీశాడు. అనంతరం రైలు ఎక్కుతుండగా.. కాలు జారి అతడు ట్రైన్, ప్లాట్‌ఫాం మధ్యలో పడిపోయాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న రైల్వే పోలీసు అధికారి(RPF), ఇతర ప్రయాణికులు వెంటనే స్పందించాడు. లోకోపైలెట్‌కు కూడా విషయం తెలియడంతో ట్రైన్‌ను నిలిపివేశాడు. అనంతరం కొద్ది సమయం శ్రమించి.. యువకిడి క్షేమంగా బయటకు తీశారు. ఈ దృశ్యాలన్నీ అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆ వీడియో(Viral Video)ను రైల్వే అధికారులు సోషల్ మీడియా(Social Media)లో పోస్ట్ చేయడంతో అదికాస్తా ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Updated Date - 2022-12-25T11:40:35+05:30 IST