Bangladesh vs India: లిటన్ దాస్ అర్ధ సెంచరీ.. 100 దాటిన బంగ్లాదేశ్ ఆధిక్యం

ABN , First Publish Date - 2022-12-24T14:14:09+05:30 IST

భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు టీ బ్రేక్ సమయానికి ఆతిథ్య బంగ్లాదేశ్ 7 వికెట్ల నష్టానికి

Bangladesh vs India: లిటన్ దాస్ అర్ధ సెంచరీ.. 100 దాటిన బంగ్లాదేశ్ ఆధిక్యం

ఢాకా: భారత్‌(Team India)తో జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు టీ బ్రేక్ సమయానికి ఆతిథ్య బంగ్లాదేశ్ 7 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్ అక్షర్ పటేల్ విజృంభించి మూడు వికెట్లు తీయడంతో బంగ్లాదేశ్(Bangladesh) బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. ఓవర్ నైట్ స్కోరు 7/0తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆతిథ్య జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. సహచరులు ఒక్కొక్కరే వెనుదిరుగుతున్నా ఓపెనర్ జకీర్ హసన్ (Zakir Hasan)మాత్రం క్రీజులో పాతుకుపోయి అర్ధ సెంచరీ (51) పూర్తి చేశాడు.

ఆ తర్వాత లిటన్ దాస్ (Litton Das) కూడా క్రీజులో కుదురుకుని అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని క్రీజులో ఉన్నాడు. నూరుల్ హసన్ 31 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగులో అవుటయ్యాడు. నజ్ముల్ హొసైన్ (5), మోమినుల్ హక్ (5), షకీబల్ హసన్ (13), ముస్తాఫికర్ రహీమ్(9), మెహిదీ హసన్ (0) దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు వికెట్లు పడగొట్టగా, ఉమేశ్, అశ్విన్, ఉనద్కత్, సిరాజ్ చెరో వికెట్ తీసుకున్నారు.

Updated Date - 2022-12-24T14:17:43+05:30 IST