Home » Bangladesh
గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. ఏకంగా 3500 రూపాయలు పలుకుతుంది. కేజీ గ్యాస్ ధర అయితే గరిష్టంగా 200 రూపాయలకు పైగా ఉంది.. మరి గ్యాస్ ధర ఇంత భారీగా ఎందుకు పెరిగింది.. అసలు ఈ రేటు ఎక్కడ అమల్లో ఉంది అనే వివరాలు..
బ్యాంకాక్ సదస్సులో బిమ్ స్టెక్ ను బలోపేతం చేయడానికి ప్రధాని మోదీ 21 సూత్రాల ప్రణాళికను ప్రతిపాదించారు. వివిధ దేశాలతో చెల్లింపు వ్యవస్థలు అనుసంధానం చేస్తే పర్యాటక వాణిజ్య రంగాలలో ప్రయోజనాలు అందుతాయని తెలిపారు
సుస్థిర, ప్రగతిశీల, ప్రశాంత, ప్రజాస్వామ్య బంగ్లాదేశ్కు తమ మద్దతు ఉంటుందని, ప్రజలే కేంద్రంగా ఉంటే సంబంధాలకు భారత్ ప్రాధాన్యమిస్తుందని యూనస్తో జరిగిన భేటీలో మోదీ పునరుద్ఘాటించినట్టు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్ మిస్రి తెలిపారు.
భారత్పై అమెరికా తక్కువ సుంకాలు విధించడంతో ఇది మనకు పెట్టుబడులు ఆకర్షించే అవకాశం. చైనా, వియత్నాం, బంగ్లాదేశ్ పై అధిక సుంకాలతో, బహుళజాతి కంపెనీలు భారత్ వైపు ఆకర్షితమయ్యే అవకాశం ఉంది
పశ్చిమబెంగాల్లోని సిలిగురి కారిడార్ యొక్క మరోపేరు చికెన్ నెక్. కోడి మెడ ఆకారంలో ఉండటంతో ఈ ప్రాంతానికి చికెన్ నెక్ అనే పేరు వచ్చింది. ఈ ప్రాంతంలో భారత్లోని ఈశాన్య రాష్ట్రాలను దేశంతో అనుసంధానించే ఒక సన్నని భూభాగం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సిలిగురి నగరం చుట్టూ ఉన్న 20 నుంచి 22 కిలోమీటర్లు ఉండే ఈ ప్రాంతం అంతర్జాతీయ సరిహద్దులు కలిగి ఉంది.
China-Bangladesh: చైనా పర్యటన సందర్భంగా బంగ్లా తాత్కాలిక అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ ఇండియాతో శత్రుత్వం పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు సంకేతం ఇచ్చాడు. భారతదేశానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహ్మద్ యూనస్ మాట్లాడుతూ, ఈశాన్య రాష్ట్రాలకు సముద్ర మార్గం లేకపోవడం, బంగ్లాదేశ్ మాత్రమే బంగాళాఖాతాన్ని సంరక్షించేది అని చెప్పారు. చైనా బంగ్లాదేశ్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చన్నారు.
Modi - Muhammad Yunus: పొరుగు దేశం బంగ్లాదేశ్ (Bangladesh)లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఆ దేశంలో హిందువులపై హింసాత్మక దాడులు తీవ్రమయ్యాయి. ఇరుదేశాల మధ్య దూరం పెరుగుతున్న సమయంలో బుధవారం 53వ స్వాతంత్ర్య దినోత్సవం చేసుకున్న బంగ్లాదేశ్ ప్రజలను ఉద్దేశిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ (Muhammad Yunus)కు ప్రత్యేక లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ గుండె పోటుకు గురయ్యాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
బంగ్లాదేశ్లో మైనారిటీలపై హింసను ఎదుర్కొంటున్నారంటూ అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసీ గాబార్డ్ చేసిన ఆరోపణలను బాంగ్లాదేశ్ ఆపద్ధర్మ ప్రభుత్వం తోసి పుచ్చింది. అవన్నీ నిరాధార ఆరోపణలని పేర్కొంది.