ఇస్తాంబుల్లో ఐపీఎల్ మినీ వేలం?
ABN , First Publish Date - 2022-10-27T05:29:19+05:30 IST
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మినీ వేలం డిసెంబరు 16న జరిగే అవకాశముంది.
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మినీ వేలం డిసెంబరు 16న జరిగే అవకాశముంది. ఈ వేలానికి ఆతిథ్యమిచ్చే ఐదు వేదికల్లో ఒకటిగా ఇస్తాంబుల్ను బీసీసీఐ ఎంపిక చేసినట్టు సమాచారం. ఇస్తాంబుల్తోపాటు బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబై, హైదరాబాద్ ఐపీఎల్ వేలం ఆతిథ్య రేసులో ఉన్నట్టు బీసీసీఐ అధికారి ఒకరు బుధవారం వెల్లడించారు.