కాంగ్రెస్‌ నేతలపై వ్యతిరేక ప్రచారం చేస్తే చర్యలు

ABN , First Publish Date - 2022-12-21T04:08:40+05:30 IST

సోషల్‌ మీడియాను వేదిక చేసుకుని కాంగ్రెస్‌ నేతలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే చర్యలు తప్పవని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి హెచ్చరించారు.

కాంగ్రెస్‌ నేతలపై వ్యతిరేక ప్రచారం చేస్తే చర్యలు

ఇది రేవంత్‌ మాట- మల్లు రవి

హైదరాబాద్‌, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): సోషల్‌ మీడియాను వేదిక చేసుకుని కాంగ్రెస్‌ నేతలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే చర్యలు తప్పవని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి హెచ్చరించారు. ఆదివారంనాడు జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ విషయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టంగా ప్రకటించారని తెలిపారు. రేవంత్‌ ఆదేశాలను పార్టీ నేతలు, శ్రేణులు తు.చ తప్పకుండా పాటించాలన్నారు. సామాజిక మాద్యమాలలో పార్టీకి, నాయకులకు వ్యతిరేకంగా ఎవ్వరు పోస్టులు పెట్టినా చట్టపరంగాను, పార్టీ పరంగానూ చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Updated Date - 2022-12-21T04:08:40+05:30 IST